చెన్నై, జూన్ 28: cm సి. జోసఫ్ విజయ్ ఆదివారం జాతీయ పోలియో చుక్కల మందు ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు అందించారు. వైద్యం మరియు ప్రజా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలోని పాలవాక్కం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ పోలియో చుక్కల మందు ప్రత్యేక శిబిరంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు బొమ్మలు అందజేసి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. పిల్లలను పోలియో వ్యాధి నుంచి పూర్తిగా రక్షించేందుకు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…
తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు…
దేశంలోని యువతను క్రీడల దిశగా ప్రోత్సహించడంతో పాటు, క్రీడాకారులకు సముచిత గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని…
సేవ, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన Mana అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) 2వ మహాసభలు అత్యంత వైభవంగా…
తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల…
భారీ అంచనాల నడుమ రాబోతున్న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…