Categories: Movie News

వచ్చేస్తున్న ఘట్టమనేని వారసుడు.. ‘ శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్లు శ్రీనివాస మంగాపురం సినిమాపై అంచనాలను పెంచాయి.

‘RX 100’, ‘మంగళవారం’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా  హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఓ ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ManaTV Team

Recent Posts

‘ విశ్వంభర’ Vs ‘ జైలర్ 2 ’ .. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ.?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…

8 hours ago

‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌కు బన్నీ సపోర్ట్.. యూనిట్ లో కొత్త జోష్

‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…

8 hours ago

జాగ్రత్త అవసరం.. ఫుడ్ సేఫ్టీపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…

17 hours ago

బేబీ బంప్‌తో సమంత వర్కౌట్‌.. భర్తతో దిగిన ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది’’ అంటూ సోషల్…

17 hours ago

తిరుమలలో ‘నో హారన్’ నిబంధన అమలు.. హారన్లు మోగిస్తే చర్యలు, జరిమానా అవకాశం

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…

1 day ago

ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ స్థాయిలో VB-G RAM G ప్రారంభం

తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు…

1 day ago