మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘విశ్వంభర’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. చిరంజీవి కెరీర్లో ఇదొక విభిన్నమైన ఫాంటసీ ఎంటర్టైనర్గా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ‘ విశ్వంభర’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆసక్తిని మరింత పెంచాయి. కుటుంబ ప్రేక్షకులు, సెలవుల వాతావరణం నేపథ్యంలో ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ చిత్రం కూడా దసరా సీజన్ ను టార్గెట్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’, ‘ జైలర్ 2’ ఒకే సమయంలో విడుదల అయితే, భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ బాక్సాఫీస్ పోటీ జరగడం ఖాయం. కానీ, ఈ పోటీ ఉంటుందా.?లేదా.? అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…
‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…
టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్లా గడిచింది’’ అంటూ సోషల్…
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…
తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు…