టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో జానీ మాస్టర్ స్పందించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.
శేఖర్ మాస్టర్ తనకు అన్నలాంటి వ్యక్తి అని, తమ మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలు, తప్పుడు వీడియోలను నమ్మవద్దని అభిమానులను కోరారు. ఈ పుకార్లు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా స్పందించినట్లు జానీ మాస్టర్ వెల్లడించారు. ఒక సినిమా షూటింగ్ సెట్స్లో తమ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారని, అనంతరం తాను, శేఖర్ మాస్టర్ కలిసి చిరంజీవితో సంతోషంగా భోజనం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి చూపిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెట్స్లో కలిసి దిగిన ఫొటోలను కూడా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
జానీ మాస్టర్ వివరణతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విభేదాల ప్రచారానికి తెరపడింది. అభిమానులు, సినీ వర్గాలు కూడా ఈ వివరణను స్వాగతిస్తూ, ఇద్దరు కొరియోగ్రాఫర్లు ఇలాగే కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాయి.
తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై…
అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్–2026లో ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలుకుతూ తొలిసారిగా…
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న తెలంగాణ అమెరికన్…
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని…
ప్రముఖ నటి శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి…
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలో…