
న్యూయార్క్/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ సతీమణి కి ప్రమాదం జరిగింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన సతీమణి, ప్రముఖ సీనియర్ డాక్టర్ సుచి యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే… మధుయాష్కీ గౌడ్, డాక్టర్ సుచి యాష్కీ దంపతుల కుమార్తె డాక్టర్ గగన యాష్కీ అమెరికాలో ఎండీ (MD) కోర్సు సీటు సాధించారు. కుమార్తెను ఉన్నత చదువుల కోసం బోస్టన్లోని కాలేజీలో జాయిన్ చేయడానికి ఈ దంపతులు అమెరికా వెళ్లారు. అడ్మిషన్ ప్రక్రియ ముగించుకుని, బోస్టన్ నుండి తిరిగి న్యూయార్క్కు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
