టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల తన మూడో సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ‘బబుల్గమ్’, ‘మోగ్లి’ చిత్రాలతో హీరోగా పరిచయమైన ఆయనకు ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో, మూడో సినిమా కోసం రోషన్ ఒక వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు విఐ ఆనంద్ కథ అందించడంతో పాటు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. విజయ్ కె. కమ్మిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా… బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు పనిచేసిన దిగ్గజ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ పనిచేస్తుండటం విశేషం.
సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ అంశాలతో భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రోషన్ సరసన గహజీ షిజు కున్నత్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్య, సుదర్శన్, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్లో భారతీయ ప్రవాసుల నుంచి లభించిన అపూర్వ స్వాగతం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని భారత ప్రధాని నరేంద్ర…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ శుక్రవారం (జూలై 10, 2026) కరూర్ నగరంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు…
న్యూజెర్సీ నార్త్ బ్రన్స్విక్లోని సాయి పరివార్ మందిర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సాయి బాబా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి…
చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ మూవీస్ ను అందించిన…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్'. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు…
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సైరాబాను' తొలి షెడ్యూల్ చిత్రీకరణను విజయవంతంగా…