ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కుమారుడు రామ్ చరణ్ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలవడంపై మెగాస్టార్ చిరంజీవి ఉప్పొంగిపోయారు. ఒక తండ్రిగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని ఓ పద్యాన్ని ఆయన ఉటంకించడం విశేషం.
‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అనే పద్యాన్ని పోస్ట్ చేసిన చిరంజీవి.. కొడుకు పుట్టినప్పుడు కాకుండా, అతని గొప్పతనాన్ని చూసి ప్రజలు మెచ్చుకున్నప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని చెప్పారు. ఇటీవలే ‘పెద్ది’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, రామ్ చరణ్ను ప్రశంసించారు.
ప్రధాని పాల్గొన్న వేదికపై రామ్ చరణ్కు దక్కిన గౌరవం చూసి, ఒక తండ్రిగా గర్వంగా ఉందని చిరంజీవి తన పోస్ట్లో తెలిపారు. తన కృషి, అంకితభావంతో చరణ్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ సందర్భంలోనే రామ్ చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నార్నే నితిన్ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు #NN5…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజా చిత్రం 'లెనిన్'. పవర్ఫుల్ రా అండ్ రస్టిక్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా…
షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…
సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…