Categories: Sports

వింబుల్డన్‌ ఉత్కంఠకు తెర.. నిరసనపై వెనక్కి తగ్గిన స్టార్ ప్లేయర్స్

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మీడియా సమావేశాలను పరిమితం చేయాలనే తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ ప్రకటించారు.ఈ మేరకు నిర్వాహకులతో జరిపిన చర్చలు ఫలించాయని తెలిపారు. దీంతో టోర్నమెంట్ మీడియా కార్యకలాపాలు యథాతథంగా కొనసాగనున్నాయి.

గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ వాటా, ఆటగాళ్ల సంక్షేమానికి మరిన్ని నిధులు, టోర్నీల పాలనలో కమిటీ ఏర్పాటు వంటి పలు డిమాండ్లతో 2025 నుంచి ప్లేయర్స్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వింబుల్డన్ ఫస్ట్ వీక్ లో మీడియా సమావేశాలను కేవలం 15 నిమిషాలకే పరిమితం చేయాలని మొదట నిర్ణయించారు.కానీ, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.అయితే, అసలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని చెప్పారు. నిర్వాహకుల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, ఆటగాళ్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ఆల్ ఇంగ్లండ్ క్లబ్.. ప్రైజ్ మనీ నమూనా, పాలనలో ప్రాతినిధ్యం వంటి అంశాలపై పక్కా ప్రణాళికలు రూపొందించడానికి అంగీకారం తెలిపిందని తెలుస్తోంది.మొత్తంగా ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినప్పటికీ, ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగనున్నాయి. కాగా, గ్రాస్ కోర్టుపై జరిగే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ లండన్ లో ప్రారంభమైంది.

ManaTV Team

Recent Posts

రేపే ‘నాగబంధం’ రిలీజ్… ప్రారంభమైన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్

భారీ అంచనాల నడుమ రాబోతున్న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…

13 minutes ago

స్టార్ హీరో సూర్య పొలిటికల్ ఎంట్రీ.?

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ మరోసారి చర్చకు దారితీసింది. నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీతో విజయవంతం కావడంతో ఇతర…

2 hours ago

వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం..?

ఇంగ్లాండ్‌తో తొలి టీ20లోనూ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మాజీ…

4 hours ago

అమరావతి నిర్మాణాల ఖర్చుపై జగన్ సంచలన ఆరోపణలు

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ…

18 hours ago

Pawan Kalyan: ‘భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే దూషించే హక్కు కాదు’

వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో…

18 hours ago

అమెరికాలో బాలీవుడ్ సింగర్ సందడి.. న్యూజెర్సీ ‘ఆర్‌కే జువెల్స్’ను సందర్శించిన విశాల్ మిశ్రా!

న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని…

22 hours ago