– అంతర్జాతీయ శాంతి, సమగ్రతకు టెర్రరిజంతో పెను ముప్పు
– ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు అవసరం
ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ పాటించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు అవసరం అని తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, వివాదాలపై స్పందించారు.
అంతర్జాతీయ శాంతి, సమగ్రతకు టెర్రరిజంతో పెను ముప్పు పొంచి ఉందని విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టం తెలిపారు. సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల వల్ల దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా రాజీలేని నియమంగా ఉండాలని స్పష్టం చేశారు. లేకపోతే అది భారీ మూల్యానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాద దాడిలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది.