Find Articles

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు.. కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి జస్టిస్ స్వర్ణకాంత శర్మను ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజాలతో కూడిన ధర్మాసనం ముగ్గురికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.

మద్యం పాలసీ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, వారి మద్దతుదారులు లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు పెట్టారు. ఓ విద్యాసంస్థలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ మాట్లాడిన పాత వీడియోను ఎడిట్ చేసి, ఆమె ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగా తప్పుడు ప్రచారానికి తెరతీశారు.ఆమె ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.ఆ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ తనపై దుష్ప్రచారం సాగించారనే ఆరోపణలపై స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *