
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘AA23’. గత కొన్ని రోజులుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ హద్దులు లేకుండా వ్యాపిస్తున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం అభిమానులకు, ప్రేక్షకులకు పెద్ద టాస్క్ గా మారుతోంది. ఇదే తరహాలో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రావాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ పుకార్లకు ఫేమస్ డైరెక్టర్, రైటర్ రత్నకుమార్ తన స్టైల్ లో చెక్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘ విక్రమ్’ సినిమా రిలీజై సక్సెస్ ఫుల్ గా నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ ను అభినందించిన ఆయన తాను ‘AA23’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. ఆయన డైరెక్ట్ గా ఈ రూమర్ల గురించి ప్రస్తావించకపోయినప్పటికీ, బన్నీ -లోకేష్ సినిమా లైన్ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో రాకా మూవీ చేస్తున్నారు. ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో మూవీ చేయబోతున్నారు. అటు లోకేష్ ఖైదీ 2 చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇద్దరికీ ఇప్పట్లో టైమ్ సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సమయంలోనే పాన్ ఇండియా మూవీ అటకెక్కిందన్న వార్తలు రావడంతో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్, లోకేష్ మూవీనే అని అనుకున్నారు. కానీ రత్న కుమార్ ట్వీట్ తో ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది.

