
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంలోనే ఆయన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు చెందిన ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ కలిసి ఒక భారీ మలయాళ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేసింది.
19వ శతాబ్దపు కేరళ జానపద, సాంస్కృతిక గాథల ఆధారంగా ‘ఓడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్టులో పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని కరణ్ జొహార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఈ తరం సినిమాలో జానపద కథలను ఇంట్రెస్టింగ్గా చూపించడంలో రాహుల్ స్టైల్ అద్భుతమని కొనియాడారు.

