
ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల కూటమి అయిన జీ-7 (G7) సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికగా అభివృద్ధి నమూనాలపై (Development Models) భారత దృక్పథాన్ని స్పష్టంగా వివరించిన ఆయన, ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తారు. ‘ఎవరిది వృద్ధి.. ఎవరికి వృద్ధి?’ అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది.
జీడీపీ లెక్కలే నిజమైన అభివృద్ధి కాదు!
సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. కేవలం కేవలం ‘జీడీపీ (GDP), వృద్ధిరేటు’ గణాంకాలతోనే ఒక దేశం సాధించిన అభివృద్ధిని అంచనా వేయలేమని స్పష్టం చేశారు. కేవలం కాగితాల మీద కనిపించే అంకెలు, ఆర్థిక లెక్కలు మాత్రమే ప్రగతికి కొలమానం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల జీవితాల్లో మార్పు రావడమే అసలైన ప్రగతి:
సాధారణ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును, గుణాత్మకమైన ఎదుగుదలను తీసుకువచ్చే వృద్ధే నిజమైన అభివృద్ధి అని పీఎం మోదీ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరినప్పుడే ఆ వృద్ధికి ఒక అర్థం ఉంటుందని వివరించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నీ సమగ్ర, సమాన అవకాశాల వృద్ధిపై (Inclusive and Equitable Growth) ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

