
ఇంగ్లాండ్తో తొలి టీ20లోనూ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తరఫున ఆడే అవకాశం కల్పించడంలో మరింత ఆలస్యం చేస్తే అతడిపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వైభవ్ సూర్యవంశీకి అవకాశం వచ్చినప్పుడు వెంటనే తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. అందుకే ఆలస్యం అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతుందన్నారు. అయితే 15 ఏళ్ల వయసులో ఆటగాళ్లు ఒత్తిడి గురించి ఎక్కువగా ఆలోచించరని చెప్పారు. అయినప్పటికీ భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఉండడం, వారి నుంచి నేర్చుకోవడం వైభవ్కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే, ఐర్లాండ్ సిరీస్లోనూ బెంచ్కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీకి, ఇంగ్లాండ్తో తొలి టీ20లో కూడా అవకాశం లభించలేదనే విషయం తెలిసిందే.

