
కోలీవుడ్లో హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన లోకేశ్… హీరోగా ‘డీసీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన నిర్మాతగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విశాల్ వెంకట్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో అందాల భామ రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.
లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ‘డీసీ’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తన నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్గా, హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమా ఇండస్ట్రీలో తన ముద్ర వేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా రెజీనా కసాండ్రా మరో మంచి అవకాశం కొట్టేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం.

