
సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటారు. అయితే తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో త్రిష చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ జారాలో ఆన్ లైన్ షాపింగ్ చేసిన త్రిష.. ఆ సంస్థ డెలివరీ తీరుపై మండిపడ్డారు. వరుసగా మూడుసార్లు తనకు వచ్చిన బట్టలు దుర్వాసన వచ్చాయని సీరియస్ అయ్యారు. హోమ్ డెలివరీ చేసేటప్పుడు లేదా కనీసం ప్యాక్ చేసే ముందు అయినా బట్టలు ఎలాంటి వాసన వస్తున్నాయో చూడాలని సూచించారు. ‘ డియర్ జారా.. ఒక చిన్న రిక్వెస్ట్.. మేం మరోసారి హోమ్ డెలవరీ కోసం ఆర్డర్ చేసినప్పుడు, దుస్తుల నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోండి. ఇప్పటికే మూడు సార్లు ఆర్డర్ చేస్తే దుర్వాసన వస్తున్న బట్టలు పంపించారు. కనీసం ప్యాక్ చేసే ముందైన ఆ బట్టలు ఎలాంటి వాసన వస్తున్నాయనేది చూడండి’ అంటూ పోస్టులో రాసుకొచ్చారు త్రిష. ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళం, మలయాళంలో ప్రాజెక్టులకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

