Find Articles

ATA మహాసభలపై బిగ్ అప్‌డేట్.. సతీశ్ రామసహాయం రెడ్డితో ప్రత్యేక లైవ్ షో

ATA మహాసభలపై బిగ్ అప్‌డేట్.. సతీశ్ రామసహాయం రెడ్డితో ప్రత్యేక లైవ్ షో

అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌కు ముందుగా తెలుగు ప్రవాసులకు ప్రత్యేక లైవ్ షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ATA ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీశ్ రామసహాయం రెడ్డి పాల్గొని మహాసభల ముఖ్యాంశాలు, ఏర్పాట్లు, ప్రత్యేక కార్యక్రమాలు, పాల్గొనే విధానం వంటి వివరాలను పంచుకోనున్నారు. ATA 19వ మహాసభలు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్నట్లు సంఘం ఇప్పటికే ప్రకటించింది.

ఈ ప్రత్యేక లైవ్ కార్యక్రమం జూలై 26 (ఆదివారం) ప్రసారం కానుంది. అమెరికా ఈస్ట్ టైమ్ (EST) ప్రకారం సాయంత్రం 5:00 నుంచి 5:30 గంటల వరకు, సెంట్రల్ టైమ్ (CST) ప్రకారం సాయంత్రం 4:00 నుంచి 4:30 గంటల వరకు, భారత కాలమానం (IST) ప్రకారం తెల్లవారుజామున 2:30 నుంచి 3:00 గంటల వరకు వీక్షించవచ్చు. తెలుగు ఎన్‌ఆర్‌ఐ రేడియో వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా ఈ లైవ్ షో అందుబాటులో ఉంటుంది. బాల్టిమోర్‌లో జరగనున్న ATA మహాసభలకు హాజరుకానున్న వారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి సభలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ManaTV Team