భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. గత మే నెలలో జరిగిన తొలి విడత కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన రోహిత్, రెండో విడతలో తన భార్య రితికా సజ్దేతో కలిసి విచ్చేసి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్ రంగానికి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రోహిత్ను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోహిత్, మూడు ఫార్మాట్లలోనూ అద్వితీయమైన రికార్డులను నెలకొల్పారు..అదేవిధంగా టెస్టుల్లో 4,300 పైగా పరుగులు, వన్డేల్లో 11,500 కంటే ఎక్కువ పరుగులు, టీ20ల్లో 4,200 పైగా పరుగులు చేసి తన మార్క్ చూపించారు. అంతేకాదు రోహిత్ సారథ్యంలోనే భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.
షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…
సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…
కోలీవుడ్లో హిట్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…
టాలీవుడ్ మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…