ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీకి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ డ్రోన్ అత్యంత సమీపంలోకి వచ్చినట్లు నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ వెల్లడించారు.
విమానం నుంచి డ్రోన్ కాస్త అటూఇటుగా వచ్చినా ఢీకొనే ప్రమాదం ఉండేదని ఆయన తెలిపారు. అయితే డ్రోన్ విమానానికి ఎంత దూరంలోకి వచ్చిందన్న వివరాలను వెల్లడించలేదు.
ఈ ఘటన అనంతరం జెలెన్స్కీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. అనంతరం ఆయన ప్రయాణిస్తున్న విమానం నార్వే రాజధాని ఓస్లోలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే డ్రోన్ ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.