రష్యా నుంచి డీజిల్ ఎగుమతులు తగ్గడం, అమెరికా నుంచి సరఫరాలు మందగించడంతో యూరప్కు డీజిల్ సరఫరాలో భారత్ కీలకంగా మారింది. వోర్టెక్సా నివేదిక ప్రకారం, ఆగస్టులో బాబ్-ఎల్-మండేబ్ మార్గం ద్వారా రోజుకు సుమారు 2 లక్షల బ్యారెళ్ల డీజిల్ యూరప్కు చేరింది. ఇది యూరప్ మొత్తం డీజిల్ దిగుమతుల్లో దాదాపు 60 శాతంగా నమోదైంది.
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం కలిగిన దేశంగా భారత్, దేశీయ అవసరాలకు మించి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా రిఫైనరీలు దెబ్బతినడం వల్ల అక్కడి నుంచి డీజిల్ సరఫరాలు తగ్గాయి.
మరోవైపు, శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో యూరప్లో డీజిల్కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారత్ నుంచి ఇంధన ఎగుమతులు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.