
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తు్న్న అందాల భామ ‘త్రిష’. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా, వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో-ఫాంటసీ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు.
అయితే తాజాగా త్రిషకు అదిరిపోయే సమ్మర్ సర్ ప్రైజ్ అందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల..త్రిషకు నోరూరించే స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన నేతృత్వంలో ప్రముఖ హోమ్ ఫుడ్ బ్రాండ్ ‘ అత్తమ్మాస్ కిచెన్ ’ నడుస్తోంది. వీరి నుంచి త్రిషకు స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ అందింది. ఇందులో కొత్త ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు ఉన్నాయి. దీంతో గిఫ్ట్ బాస్కెట్ ను ఫోటో తీసిన సౌత్ క్రీన్ తన అఫీషియల్ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ స్టోరీని ఉపాసనకు ట్యాగ్ చేస్తూ.. అద్భుతమైన గిఫ్ట్ చూస్తుంటే నాకు నిజంగానే సమ్మర్ వచ్చేసినట్లు అనిపిస్తోంది. థ్యాంక్యూ సో మచ్ ఉపాసన అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్రిష పెట్టిన ఈ పోస్టును ఉపాసన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో రీ-షేర్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు.

