
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులతో మాటలు కలుపొద్దు. వారికి మీ వ్యక్తిగత సమాచారం, వివరాలు ఇవ్వొద్దని సూచించారు. . తెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, ఏదైనా మోసం గుర్తిస్తే వెంటనే సైబర్ సెల్ ను సంప్రదించాలని సూచించారు. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరిగి పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా నష్టం, మానసిక ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తెలంగాణ పోలీసులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

