
బ్రాటిస్లావా: భారత్, స్లోవేకియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేసినందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా రిపబ్లిక్ తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, పీఎం మోదీకి ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ (ఫస్ట్ క్లాస్) – (The Order of the White Double Cross – 1st Class) అవార్డును బహూకరించారు. ఒక విదేశీ దేశం నుండి ప్రధాని మోదీ అందుకున్న 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది.1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.
