టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఆర్కే బీచ్ సమీపంలోని గోకుల్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ వేదికపై నుంచి సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత రాజ్ నిడిమోరు అధికారికంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ, సినిమా విడుదలకు ముందు కొంత ఆందోళన చెందినట్లు చెప్పారు. కనీసం ఒక్క టికెట్ అయినా అమ్ముడుపోతుందా.? అనే భయంలో ఉన్నట్లు తెలిపారు. కానీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. అనారోగ్యం తర్వాత తాను తిరిగి సినిమాల్లో నటించడానికి తన భర్త, నిర్మాత రాజ్ నిడిమోరు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. అయితే, సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్పై మా ఇంటి బంగారం సినిమా రూపొందింది. జూన్ 19న విడుదలైన ఈ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…
‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…
టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్లా గడిచింది’’ అంటూ సోషల్…
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…