Categories: Sports

ఐర్లాండ్‌తో ఓటమికి కారణం అదే.. అభిషేక్ శర్మ క్లారిటీ

టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో34 పరుగుల తేడాతో టీమిండియాను ఐర్లాండ్ జట్టు చిత్తు చేసింది. ఈ విజయంతో ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ భారత్‌పై గెలవని ఆ జట్టు, ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 18.5 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ లార్కన్ టక్కర్ హాఫ్ సెంచరీతో టీమ్ కు బలమైన పునాది వేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్లతో నిండిన లైనప్ ఐర్లాండ్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశారు. మిగతా బ్యాటర్లు అతనికి సరైన సహకారం అందించకపోవడంతో భారత టీమ్ ఓటమి ఖాయమైంది. ఐర్లాండ్ బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్, మాట్ హాలార్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించారు. అరంగేట్ర బౌలర్ జై మూంద్రా కూడా రెండు కీలక వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

అయితే, భారత ఓటమిపై అభిషేక్ శర్మ స్పందించారు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడమే తమ పరాజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. వరుసగా మ్యాచ్‌లు ఆడేటప్పుడు, ప్రాక్టీస్ సెషన్లలోనే పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. కానీ ఒక బలమైన టీమ్ గా ఉండి కూడా తాము త్వరగా అలవాటు పడటంలో ఫెయిల్ అయినట్లు తెలిపారు.

ManaTV Team

Recent Posts

‘ విశ్వంభర’ Vs ‘ జైలర్ 2 ’ .. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ.?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…

11 hours ago

వచ్చేస్తున్న ఘట్టమనేని వారసుడు.. ‘ శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…

11 hours ago

‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌కు బన్నీ సపోర్ట్.. యూనిట్ లో కొత్త జోష్

‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…

11 hours ago

జాగ్రత్త అవసరం.. ఫుడ్ సేఫ్టీపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…

20 hours ago

బేబీ బంప్‌తో సమంత వర్కౌట్‌.. భర్తతో దిగిన ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది’’ అంటూ సోషల్…

20 hours ago

తిరుమలలో ‘నో హారన్’ నిబంధన అమలు.. హారన్లు మోగిస్తే చర్యలు, జరిమానా అవకాశం

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…

2 days ago