కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. రీసెంట్ గా ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్.. 1981 లో నటి ప్రవీణను పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమె మరణించారు. ఆ తరువాత 1984లో ప్రముఖ నటి పూర్ణిమను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. అలాగే భాగ్యరాజ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా, కథా రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.మధ్యతరగతి కుటుంబాల జీవనశైలిని ప్రతిబింబించే కథలు, ఎంతో సహజమైన సంభాషణలు, భావోద్వేగాలతో కూడిన సినిమాలకు భాగ్యరాజ్ పెట్టింది పేరు.తన సినీ కెరీర్ లో సుమారు 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 75కిపైగా సినిమాల్లో నటించారు.
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…
‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…
టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్లా గడిచింది’’ అంటూ సోషల్…
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…