Categories: India News

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు.. ముగ్గురు సీనియర్ అధికారుల అదుపులోకి?

సికింద్రాబాద్‌ బొల్లారంలోని 20 మద్రాస్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ నిమిత్తం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.

ఇప్పటికే నలుగురు అగ్నివీర్‌ గార్డులను విచారించిన అధికారులు.. వారి నుంచి లభించిన సమాచారంతో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కేసు వెలుగులోకి వచ్చిన దాదాపు 10 రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

విచారణలో భాగంగా.. రెజిమెంట్‌ శిక్షణా కేంద్రంలో వినియోగించే కొన్ని ఆయుధాలు, బుల్లెట్లకు ప్రత్యేక కోడింగ్‌ నంబర్లు లేకపోవడాన్ని నిందితులు గుర్తించినట్లు సమాచారం. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని పక్కా ప్రణాళికతో మూడు నెలల పాటు విడతలవారీగా ఆయుధాలను బయటకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

అత్యాధునిక ఏకే-203, ఇన్సాస్‌ రైఫిల్స్‌, పిస్టల్స్‌ సహా మొత్తం 12 ఆయుధాలను పలు దఫాలుగా బయటకు తరలించినట్లు సమాచారం.

అలాగే ఆయుధాగారం వద్ద రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీ కెమెరాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. డ్యూటీలో ఉన్న గార్డులను వివిధ పనుల పేరుతో అక్కడి నుంచి బయటకు పంపించి.. రెజిమెంట్‌లో ఏదో హడావుడి జరుగుతున్నట్లుగా పరిస్థితిని సృష్టించి ఆయుధాలను తరలించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో సీనియర్‌ ఆర్మీ అధికారులు నేరుగా పాల్గొన్నారా? లేక అగ్నివీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి వారి ద్వారా ఆయుధాలను చోరీ చేయించారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ManaTV Team

Recent Posts

రాకా’లో విల్ స్మిత్? వైరల్ అవుతున్న BTS పిక్‌తో మరింత పెరిగిన అంచనాలు

భారతీయ సినీ పరిశ్రమ నుంచి తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ **‘రాకా’ (Raaka)**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐకాన్ స్టార్…

4 hours ago

జెలెన్‌స్కీకి త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.. విమానానికి అత్యంత సమీపంలోకి డ్రోన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం…

4 hours ago

ఈగో లేకుండా ప్రజల కోసం పనిచేయాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: ఈగోలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం పనిచేసి నిజమైన ప్రజా సేవకులుగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…

4 hours ago

10,000 Police Posts to Be Filled Soon: Minister #naralokesh #policejobs2026 #manatv

10,000 Police Posts to Be Filled Soon: Minister #naralokesh #policejobs2026 #manatv #NaraLokesh #PoliceRecruitment #PoliceJobs #10KPoliceJobs…

8 hours ago

జయాపజయాలను సమానంగా చూడటమే నిజమైన యోగం | భగవద్గీత #bhagavadgita #lordkrishna #manatv

జయాపజయాలను సమానంగా చూడటమే నిజమైన యోగం | భగవద్గీత #bhagavadgita #lordkrishna #manatv #BhagavadGita #LordKrishna #KrishnaTeachings #GitaQuotes #BhagavadGitaQuotes…

10 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-09-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

11 hours ago