అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో నిర్వహించిన ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) రెండో మహాసభల్లో ప్రముఖ నటుడు సుమన్ పాల్గొని సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న జ్ఞాపకాలను MANA TV ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ప్రవాస తెలుగు వారందరి మధ్య ఐక్యతను పెంపొందించాలనే సంకల్పంతో దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక రాత్రి సెల్లార్లో సమావేశమై ఈ అసోసియేషన్ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు.
తదనంతరం శ్రీనివాస్, ప్రదీప్ శామల నేతృత్వంలో మాటా అసోసియేషన్ ప్రారంభమైందని, అయితే కరోనా మహమ్మారి కారణంగా అనేక కార్యక్రమాలు, వేడుకలు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. తాము అప్పట్లో కలగన్న ఆలోచన ఈరోజు విజయవంతమైన సంస్థగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ఈ కన్వెన్షన్లో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం, పరస్పర ప్రేమాభిమానాలతో కలిసి పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని సుమన్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వారందరూ కలిసికట్టుగా ఉండాలని, కష్టకాలాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం పెరిగితేనే సమాజం మరింత బలపడుతుందని పేర్కొంటూ, తెలుగు వారి ఐక్యతే మాటా సంస్థ ప్రధాన లక్ష్యమని సుమన్ స్పష్టం చేశారు.
UK లో నివసిస్తున్న తెలుగు రచయిత్రి స్నేహా రెడ్డి కొనకటి తన చిరకాల కల అయిన "1 మిలియన్ ఫాలోవర్స్"…
అమెరికా తెలుగు సంఘం (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది. ఈ మహాసభలకు…
విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని గెలుచుకున్న వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్పై కాసుల వర్షం కురిసింది. కేవలం…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆయన కొత్త సినిమా కాదు.. ఆయన…
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ త్వరలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో…
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ఏనుగు దంతాల కేసులో కీలక వివరాలను ప్రకటించారు. తన వద్ద 10 ఏనుగు దంతాలతో…