
న్యూజిలాండ్లో భారతీయ ప్రవాసుల నుంచి లభించిన అపూర్వ స్వాగతం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి ఒకరు న్యూజిలాండ్ను సందర్శించేందుకు అక్కడి భారతీయ సమాజం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సమాజం ప్రదర్శించిన అపారమైన ఉత్సాహం, ఆప్యాయత తన హృదయాన్ని హత్తుకుందని ప్రధాని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశంతో వారి అనుబంధం ఏమాత్రం తగ్గలేదని, వారి దేశభక్తి, భారతీయ సంస్కృతిపై ఉన్న ప్రేమ ప్రతి క్షణంలోనూ స్పష్టంగా కనిపించిందని మోదీ పేర్కొన్నారు.
న్యూజిలాండ్లోని భారతీయుల ఆదరణ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాల్లోని భారతీయులు భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని కొనియాడారు.
