Find Articles

మహిళల భద్రతకు ‘సింగపెన్’ స్పెషల్ ఫోర్స్.. సీఎం జోసెఫ్ విజయ్ ప్రారంభం

మహిళల భద్రతకు ‘సింగపెన్’ స్పెషల్ ఫోర్స్.. సీఎం జోసెఫ్ విజయ్ ప్రారంభం

చెన్నై: తమిళనాడులో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సింగపెన్ స్పెషల్ ఫోర్స్’ ను తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రత్యేక మహిళా పోలీసు విభాగం మహిళలపై నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, బాధితులకు సహాయం మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను నిర్వహించనుంది. ఈ దళానికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించనుండగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు దేశంలో తొలిసారిగా డ్రోన్ ఆధారిత పహారా వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.

ManaTV Team