Find Articles

మహిళా రిజర్వేషన్లపై చర్చ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితం: సీఎం చంద్రబాబు

మహిళా రిజర్వేషన్లపై చర్చ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితం: సీఎం చంద్రబాబు

స్త్రీశక్తి థీమ్‌తో, ‘జై కార్యకర్త’ నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

 

ManaTV Team